ప్రస్తుత కాలంలో యాక్టివ్ గా ఉన్న సీనియర్ నటుల లో బాలకృష్ణ ఒకరు. సుమారు నాలుగు దశాబ్దాల నుండి పోటీ పడుతూ సినిమాలో నటిస్తున్నారు, ఎన్టీ రామారావు గారి తనయుడిగా కంటే సొంత గుర్తింపును సాధించుకొని ఇతరులకు స్ఫూర్తి గా ఉంటున్నారు. గొప్ప స్టార్డమ్ ఉన్న ఆయన జీవితాన్ని పరిశీలిస్తే ఎంతోమంది టాప్ హీరోయిన్లతో నటించినప్పటికీ ఏనాడు కూడా ఆయన ఏ హీరోయిన్ తో చనువుగా కానీ , ఏదో సైడ్ ట్రాక్ నడుపుతున్నట్టు గాని కనిపించలేదు, అమ్మాయిలతో సెట్లపైన తప్ప మరి ఎక్కడ కనిపించకుండా మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉండేవాడు బాలకృష్ణ.
అయితే బాలకృష్ణ గారు కెరియర్ ప్రారంభించి మంచి ఊపు లో ఉన్నప్పుడు ఒక హీరోయిన్ ఆయనపై మనసు పడింది , ఆ హీరోయిన్ బాలయ్య గారి ని ఆమె వైపు ఆకర్షించుకుంది. వారి ఈ ట్రాక్ గురించి సినీ ప్రపంచ అంతా విస్తృతంగా పుకార్లు ప్రచారమయ్యాయి, ఇక ఆ అమ్మాయి తో పెళ్లి చేసుకోవాలని కూడా బాలకృష్ణ నిర్ణయించుకున్నాడు అయితే ఈ విషయం తెలిసిన ఎన్టీ రామారావు గారు బాలకృష్ణ గారికి వెంటనే పెళ్లి చేసి ఆ లవ్ ట్రాక్ నుండి దూరం చేశాడు.
ఆ హీరోయిన్ ఎవరో కాదు ఖుష్బూ, బాలకృష్ణ గారి వివాహం తర్వాత మళ్లీ ఈ విషయం ప్రస్తావించబడటం కనిపించలేదు.
అయితే కుష్బూను ఎన్టీరామారావు గారు నిరాకరించడానికి ముఖ్యకారణం ఎన్టీ రామారావు గారికి తన కుమారులు ఎవరికి సినిమా హీరోయిన్లు గాని పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులేవర్ని గాని కోడలుగా చేసుకోవడానికి ఆసక్తి కనుపర్చలేదు గనుకే బాలకృష్ణ గారికి ఒక మల్టీ మిలీనియర్ కూతురు అయినా వసుంధరను ఇచ్చి పెళ్ళి చేశాడు . వసుంధర గారి తండ్రి ప్రముఖ ట్రాన్స్పోర్ట్ సంస్థల అధినేత ఎస్.ఆర్.ఎమ్.టి చౌదరి గారి అన్న కుమార్తె ఆమె స్వతహాగానే పెళ్లికి ముందే కోట్లకు అధికారి అని కచ్చితంగా చెప్పగలము. తనకు ఒక వైపు లవ్ అఫైర్ ఉన్నప్పటికీ తండ్రి మాట జవదాటని కుమారుడిగా తన తండ్రి కొరకు తన ప్రేమను త్యాగం చేసి ఆదర్శవంతమైన కుమారుడిగా బాలయ్య నిలిచాడు.
ఇక కాకినాడ కు చెందిన వసుందర తో బాలకృష్ణ పెళ్లి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే పూర్తి బాధ్యత మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారికి అప్పగించారట.